ADB: రేపటి నుంచి పత్తి కొనుగోలు చేపట్టనున్నట్లు మంగళవారం ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర జిన్నింగ్ మిల్లుల అసోసియేషన్ తలపెట్టిన బంద్ను విరమించుకున్న నేపథ్యంలో ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో సీసీఐ,ప్రైవేటు ద్వారా పత్తి కొనుగోళ్లు యధావిధిగా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ విషయాన్ని రైతులు గమనించి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.