SRCL: వేములవాడ భీమన్న ఆలయంలో మంగళవారం రాత్రి కార్తీక దీపోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ రాజరాజేశ్వర స్వామివారి అనుబంధ ఆలయమైన భీమేశ్వరాలయంలో 28వ రోజు రాత్రి ఈ కార్యక్రమం జరిగింది. దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ప్రొటోకాల్ పర్యవేక్షకులు శ్రీకాంత్ చార్యులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆలయంలో భక్తులకు, సుహాసినులకు వాయినం అందజేశారు.