ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ 2025లో భాగంగా భారత్-Aతో దోహా వేదికగా జరుగుతున్న మ్యాచ్లో ఒమన్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్.. నిర్ణీత 20 ఓవర్లలో 135/7 పరుగులు చేసింది. వశీమ్ అలీ (54*) హాఫ్ సెంచరీతో రాణించాడు. భారత్ బౌలర్లలో సుయాష్ శర్మ, గుర్జప్నీత్ సింగ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు.