KNR: అప్పులు తీర్చేందుకు ఆర్ఎంపీ వైద్యుడి కళ్లలో కారం కొట్టి, గొలుసు దోచుకున్న ఐదుగురు యువకులను కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కారు, తులం బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు. జల్సాలకు అలవాటు పడి ఈ దారి దోపిడీకి పాల్పడినట్లు ఏసీబీ విజయ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు నిందితులను పట్టుకున్న సిబ్బందిని సీపీ అభినందించారు.