WNP: ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అధికారులు మహానంది, ప్రతాపరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి పోస్టర్ను విడుదల చేశారు. ఎయిడ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.