SRD: సంగారెడ్డి మండల కేంద్రమైన హత్నూర గురుకుల పాఠశాల, కేజీబీవీ పాఠశాలను సోమవారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సౌజన్య సందర్శించారు. ఈ సందర్భంగా వంటగది, సరుకులు, స్టోర్ రూమ్, డార్మెంటరీ, డైనింగ్ హాల్, మెనూ ప్రకారం వండిన భోజనం పరిశీలించారు. ఈ మేరకు విద్యార్థుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు.