MDK: కూలీలకు ఉపాధి కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చిందని కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి సర్పంచ్ పాతూరి దయాకర్ తెలిపారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గురువారం ఊసన్ కుంట చెరువు కట్ట పునరుద్ధరణ పనులను ఆయన ప్రారంభించారు. ఉప సర్పంచ్ గుండు నాని, వార్డు సభ్యులు పాల్గొన్నారు.