BDK: పోలీస్ స్టేషన్ పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వివిధ సమస్యలతో పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం చేకూర్చే విధంగా బాధ్యతగా మెలగాలని ఎస్పీ రోహిత్ రాజు సూచించారు. పాల్వంచ పోలీస్ స్టేషన్ను సోమవారం సందర్శించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను వారు పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న పోలీస్ అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.