TG: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు పోలింగ్ ప్రారంభమైంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత ఎల్లారెడ్డిగూడ నవోదయ కాలనీలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఆమెతోపాటు కుటుంబసభ్యులు కూడా తమ ఓటు సద్వినియోగం చేసుకున్నారు. అలాగే, నియోజకవర్గ ప్రజలు కూడా తమ ఓటుహక్కు వినియోగించుకోవాలని మాగంటి సునీత పిలుపునిచ్చారు.