GNTR: వచ్చే మార్చిలో పదవ తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఈనెల 13 నుంచి 25 లోగా పరీక్ష ఫీజులు చెల్లించాలని గుంటూరు డీఈవో రేణుక సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.500 అపరాధ రుసుముతో డిసెంబర్ 11 నుంచి 15 వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉందన్నారు. జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు పాఠశాల లాగిన్ ద్వారా https:///bse.ap.gov.in ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు.