AP: వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న కస్టడీ పిటిషన్పై ఇవాళ నెల్లూరు ఏసీబీ కోర్టులో విచారణ జరగనుంది. తిరుమలకు సరఫరా అయ్యే నెయ్యి కాంట్రాక్టును ప్రీమియర్ అగ్రీపుడ్స్ అనే సంస్థకు కట్టబెట్టడంలో ఆయన కీలకపాత్ర పోషించిన నేపథ్యంలో గతనెల చివర్లో అరెస్ట్ చేశారు. ఈ కేసులో అప్పన్న 24వ నిందితుడిగా పేర్కొన్నారు.