NGKL: వంగూరు మండల ఎస్సై మహేష్ మైనర్ల వివాహాలపై బుధవారం కఠిన హెచ్చరికలు జారీ చేశారు. 18 ఏళ్ల లోపు బాలికలు, 21 ఏళ్ల లోపు బాలురకు పెళ్లి చేయడం చట్టరీత్యా నేరమని ఆయన స్పష్టం చేశారు. మైనర్లను ప్రలోభపెట్టి వివాహం చేసుకున్నా, లేదా అందుకు సహకరించినా వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.