JGL: జగిత్యాల రూరల్ మండలం వంజరుపల్లి గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ రైతులు కలిసి ఎమ్మెల్యే సంజయ్ కుమార్కు వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం రైతులు తమ పంటను దూర ప్రాంతాలకు తరలించాల్సి వస్తోందని, రవాణా ఖర్చులు భారంగా మారుతున్నాయన్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి గ్రామంలోనే కొనుగోలు కేంద్రం ఏర్పాటు ఏర్పాటు చేస్తామన్నారు.