NRML: నెల రోజుల కఠోర ఉపవాసం ముగిసిన తరువాత జరగనున్న ఈద్-ఉల్-ఫితర్ పండుగ కోసం బాసర మండల కేంద్రం పూర్తి సన్నద్ధతలో ఉంది. మస్జిద్ అబూబకర్ కమిటీకి చెందిన 30 మంది యువకులు మైదానాన్ని రంగురంగుల అలంకరణలతో, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా తీర్చిదిద్దారు. శుక్రవారం జరిగే ప్రత్యేక నమాజ్ కోసం ప్రత్యేక టెంట్లు, మినీ స్పీకర్లు వంటి సౌకర్యాలను నిర్వాహకులు పూర్తి చేశారు.