MNCL: లక్షెట్టిపేటకు చెందిన లకావత్ గణేష్ (45) వడదెబ్బతో మృతి చెందాడని ఏఎస్సై అన్వర్ తెలిపారు. గణేష్ మంగళవారం కొడుకు రాజేశ్వర్ను రూ. 20 అడిగి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదన్నారు. బుధవారం ఉదయం ఇటిక్యాల చెరువు వద్ద గణేష్ శవం ఉందని స్థానికులు చెప్పడంతో కుటుంబ సభ్యులు వెళ్లి చూశారన్నారు. గణేష్ చెరువు వద్దకు బహిర్భూమికి వెళ్లి వడదెబ్బ తగిలి మృతి చెందాడన్నారు.