NZB: జిల్లా అభివృద్ధి సమన్వయ, మానిటరింగ్ కమిటీ (దిశ) సమావేశం ఈ నెల 16న ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్లో జరుగుతుందని డీఆర్డీవో సాయాగౌడ్ తెలిపారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అమలవుతున్న వివిధ పథకాలపై చర్చిస్తారని ఆయన పేర్కొన్నారు. సంబంధిత అధికారులు సకాలంలో హాజరుకావాలని సూచించారు.