NZB: జిల్లాలో వివిధ కారణాలతో చదువు మధ్యలో మానేసి ఎస్సెస్సీ, ఇంటర్ చదవాలనుకునే వారికి ప్రభుత్వం ప్రత్యేక అవకాశం కల్పించింది. పరీక్ష ఫీజు చెల్లించేందుకు ఈనెల 17వ తేదీ చివరి తేదీగా ప్రకటించింది. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్గట్ల ఎంఈవో ఆనంద్ రావు, ఐకేపీ ఏపీఎం కుంట గంగాధర్ మాట్లాడుతూ.. చదువు మధ్యలో మానేసిన వారికి ఇది సువర్ణ అవకాశమన్నారు.