SDPT: పశువులకు తప్పకుండా గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శనివారం హైదరాబాద్ శాంతినగర్ పశు వైద్య శాలలో ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి మాట్లాడారు. పశువులకు సోకే గాలికుంటు వ్యాధుల వల్ల పశువుకు జ్వరం రావడం వల్ల పాలు తగ్గిపోయే ప్రమాదం ఉందని, కావున రైతులు గాలికుంటు టీకాలు వేయించాలని కోరారు.