MLG: ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామ శివారులో శ్మశాన వాటిక నిర్మాణ పనులను శనివారం రాష్ట్ర మంత్రి సీతక్క కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తొందరలోనే శ్మశాన వాటిక నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ భానోత్ రవిచందర్, మార్కెట్ ఛైర్మన్ కళ్యాణి, సర్పంచ్ ఇస్లావత్ పులమ్మ-సంతోష్ ఉన్నారు.