SRPT: స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ కల్పించాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు రాజేష్ అన్నారు. ఆ తర్వాతనే తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం కందగట్లలో సంఘం జిల్లా అధ్యక్షులు గోగుల శేఖర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.