SKLM: ఆమదాలవలస డిప్యూటీ తహసీల్దార్గా పప్పల.గోవిందరావు బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఆమదాలవలస మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవిన్యూ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్న గోవిందరావుకు పదోన్నతి లభించడంతో డిప్యూటీ తహసీల్దార్గా నియమించబడ్డారు. పదోన్నతి పొందిన గోవిందరావుకు కార్యాలయ అధికారులు, వీఆర్వోలు అభినందనలు తెలిపారు.