KMM: ఊరికో బస్సు, ఇంటికో దీపం అనే నినాదంతో పని చేస్తున్నామని Dy.CM భట్టి విక్రమార్క మల్లు అన్నారు. బుధవారం మధిర పట్టణంలో రూ.10 కోట్ల వ్యయంతో నూతన ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణ పనులకు మంత్రి పొన్నం, జిల్లా కలెక్టర్ అనుదీప్తో కలిసి భట్టి శంకుస్థాపన చేశారు. 1987లో మొదలైన మధిర డిపో అంచెలంచెలుగా ఎదిగిందని భట్టి పేర్కొన్నారు.