TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానిస్తే రాలేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా రేపు కేంద్ర జలశక్తి మంత్రి కలిసేందుకు కూడా ఆహ్వానిస్తే.. ఆయన సీక్రెట్గా ఇవాళ ఢిల్లీ వెళ్లి కలిశారని ఆరోపించారు. సీక్రెట్గా జలశక్తి మంత్రిని కలిసే అవసరం ఏముందని ప్రశ్నించారు. ఇవాళ ఒక్కరాత్రికే కొంపలు ఏం మునిగిపోయాయని మండిపడ్డారు.