KMM: కూసుమంచి మండలంలో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించనున్నట్లు ఆయన పీఏ రాఘవరావు ఓ ప్రకటనలో తెలిపారు. నరసింహులగూడెం, పురియతండా, చింతలతండా, పోచారం, కూసుమంచి గ్రామాల్లో పర్యటించి బీటీ, సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు మంత్రి పర్యటనను విజయవంతం చేయాలన్నారు.