E.G: రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు గ్రామ వైసీపీ సీనియర్ నాయకులు డాక్టర్ మీర్జామౌలా ఆలీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం కడియంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గిరజాల వీర్రాజుని మర్యాదపూర్వక కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం పనిచేసే వారికి ఉన్నతమైన గుర్తింపు లభిస్తుందన్నారు.