TG: రాష్ట్ర రైతుల ప్రయోజనాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గోదావరి-బనకచర్లపై ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ప్రి ఫీజబిలిటీ నివేదిక సమర్పించిందని తెలిపారు. తుమ్మిడిహట్టి వద్ద 2007లో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు తలపెట్టారన్నారు. పోలవరం ప్రాజెక్టును 2009లో చేపట్టారని వివరించారు. గోదావరిలో మొత్తం 968 టీఎంసీలు వాడుకునే సదుపాయం ఉందన్నారు.