MDK: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గమ్మను బుధవారం ఎమ్మెల్సీ అంజిరెడ్డి దర్శించుకున్నారు. అర్చకులు పార్థివ శర్మ మాతకు ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం బీజేపీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా, మండల అధ్యక్షులు మల్లేశ్ గౌడ్, వడ్డ సంతోశ్ తదితరులు ఉన్నారు.