MDK: కౌడిపల్లి మండలం రాయిలాపూర్లో బుధవారం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. రెవెన్యూ సదస్సును ఆర్డీవో మహిపాల్ సందర్శించి, రైతుల సమస్యలు తెలుసుకున్నారు. భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేసిందని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతుల సమస్యలు త్వరలో పరిష్కరిస్తామన్నారు.