ప్రకాశం: మలేరియా వ్యాధిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని వైద్యాధికారిణి ప్రియాంక అన్నారు. బుధవారం పామూరు పట్టణంలోని స్థానిక ఎన్జీవో కాలనీ నందు మలేరియా నివారణ మాసోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. వివిధ రకాల వ్యాధులు వ్యాప్తికి ముఖ్యముగా దోమలు కారణమవుతున్నాయి అని అన్నారు. ఇంటి పరిసరాలలో నీటి నిల్వలు లేకుండా చూడాలని అన్నారు.