NLR: నర్రవాడలో వెంగమాంబ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వెంగమాంబ కళ్యాణం నిర్వహించారు. ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేశ్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు కుమార్తె దీపావెంకట్, మాజీ ఎమ్మెల్యే కంభం విజయరామిరెడ్డి, కాకర్ల వెంకట్, మల్లంపాటి గురవయ్య నాయుడు తదితరులు అమ్మవారికి పూజలు చేశారు.