ప్రకాశం: గిద్దలూరు నగర పంచాయతీ కార్యాలయంలో విజిలెన్స్ అధికారులు బుధవారం ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఆడదాం ఆంధ్ర కార్యక్రమానికి సంబంధించిన రికార్డులను పరిశీలించి విజిలెన్స్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. మరి కొన్ని పత్రాలు సమర్పించవలసి ఉందని సంబంధిత అధికారులను ఇప్పటికే ఆదేశించినట్లు తెలిపారు.