ADB: జిల్లాలో ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరత లేదని కలెక్టర్ రాజర్షి షా శనివారం స్పష్టం చేశారు. ప్రజల అవసరాలకు తగినంత గ్యాస్ నిల్వలు ఉండటంతో సరఫరా వ్యవస్థ సజావుగా కొనసాగుతోందన్నారు. గ్యాస్ కొరతపై వ్యాపిస్తున్న పుకార్లను నమ్మవద్దన్నారు. అనవసర భయాందోళనలకు లోనై పానిక్ బుకింగ్లు చేయడం వల్ల ఇతర వినియోగదారులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని పేర్కొన్నారు.