HYD: నాంపల్లి రైల్వేస్టేషన్ పునరాభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. నిత్యం 50వేల మందికి సేవలు అందించేలా ఆధునిక మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. ఇందుకోసం రూ.309 కోట్లను రైల్వేశాఖ ఖర్చు చేస్తోంది. వచ్చే ఏడాది డిసెంబరు నాటికి పనులు పూర్తి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రయత్నిస్తోందని CPRO శ్రీధర్ వెల్లడించారు.