గద్వాలలోని హమాలీ కాలనీలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) నాయకులు మున్సిపల్ కమిషనర్కు శుక్రవారం వినతిపత్రం సమర్పించారు. ఐద్వా జిల్లా కార్యదర్శి ఏ. నర్మద మాట్లాడుతూ.. కాలనీలో వీధి లైట్లు, సీసీ రోడ్లు, డ్రైనేజీ సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని వినతిలో పేర్కొన్నట్లు తెలిపారు.