SRCL: తంగళ్ళపల్లి మండలం సారంపల్లిలోని ముదిరాజ్ సంఘం కార్యవర్గాన్ని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని కార్యవర్గ సభ్యులు తెలిపారు. అధ్యక్షుడిగా గుండి పర్ష రాములు, ఉపాధ్యక్షుడిగా చిలుకపెళ్లి ఆకాశం, ప్రధాన కార్యదర్శిగా బరిగల రాజు, క్యాషియర్గా కూనవేని వినోద్ కుమార్, కార్యదర్శిగా రాముల బాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్నామన్నారు.