NLG: జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చందంపేటలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి బీసీ సంఘం నాయకులు బుధవారం నిరసన వ్యక్తం చేశారు. బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందుకు మేనిఫెస్టోలో పెట్టిన 42 శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా కాకుండా చట్టపరంగా అమలు చేయాలన్నారు.