HNK: ఆహార భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, పరిశుభ్రమైన, నాణ్యమైన ఆహారం తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ పబ్లిక్ గార్డెన్లో EAT RIGHT WALK కార్యక్రమాన్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై అవగాహన పెంపొందించడం అత్యంత అవసరమని పేర్కొన్నారు.