MNCL: శ్రీరాంపూర్ ఏరియా ఇందారం ఉపరితల గనిలో ఓబీ వెలికి తీసే పనులు కార్మికులతో చేపించాలని యాజమాన్యం నిర్ణయించినందున దానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని గుర్తింపు AITUC నాయకులు డిమాండ్ చేశారు. నాయకులు వీరభద్రయ్య, బాజీ సైదా బుధవారం గనిని సందర్శించి కార్మికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆపరేటర్ల, ఎలక్ట్రిషియన్లు, ఫిట్టర్ల కొరత ఉందన్నారు.