MNCL: ఆత్మవిశ్వాసంతో విద్యార్థులు పరీక్షలను బాగా రాయవచ్చని ఖానాపూర్ మండలంలోని సర్పంచులు నవీన్ యాదవ్, పేట్టెం రాధ సూచించారు. పదో తరగతి పరీక్షల నేపథ్యంలో గురువారం ఖానాపూర్ మండలంలోని బీర్నంది గ్రామ జడ్పీ పాఠశాలలో చదువుతున్న టెన్త్ విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులను అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం వరప్రసాద్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.