ADB: ఇంటర్మీడియట్ కళాశాలలో ప్రవేశాల కోసం మరొకసారి గడువు పొడిగించినట్లు ఆదిలాబాద్ DIEO జాదవ్ గణేష్ కుమార్ తెలిపారు. జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువు ఈ నెల 31వ తేదీ వరకు అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. గుర్తింపు పొందిన కళాశాలల జాబితా ఇంటర్ బోర్డు అధికారిక వెల్లడించారు.