PDPL: రామగుండం పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీ సమీపంలో మూడు రోజులుగా మంచినీటి సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్పొరేషన్, జెన్కో నీటి సరఫరా బంద్ కావడంతో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. కొండ ప్రాంతం కావడంతో బోరింగ్లు వేసే అవకాశం లేదని, అధికారులు వెంటనే స్పందించి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని కోరారు.