WNP: రంజాన్ పవిత్ర మాసం ప్రారంభమైన నేపథ్యంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్షలు (రోజులు) చేపడుతున్నారు. ప్రార్థనల సమయంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని కోరుతూ 8 వ వార్డు కౌన్సిలర్ బుసిరెడ్డి శివప్రసాద్ రెడ్డి విద్యుత్ సబ్ ఇంజనీర్కు వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా సెహ్రీ, ఇఫ్తార్ సమయాల్లో నిరంతర విద్యుత్ అందించాలని కోరారు.