JN: జనగామ పట్టణంలో డీసీపీ రాజమహేందర్ నాయక్ ఆధ్వర్యంలో గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు. సీసీటీవీల ద్వారా గ్రామ భద్రత బలోపేతం అవుతుందని, నేరాల నియంత్రణతో పాటు దొంగతనాలను నివారించడంలో ఇవి కీలకంగా ఉపయోగపడతాయని తెలిపారు.