GDWL: అలంపూర్ పట్టణంలోని వాసవి నిత్యాన్నదాన సత్రంలో రెండో అంతస్తులో నిర్మిస్తున్న కల్యాణ మండపానికి రూ.55,555 విరాళం అందజేశారు. ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన ఇల్లూరు చలపతి శెట్టి వారి తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఈ విరాళం ఇచ్చారు. ఈ సందర్భంగా సత్రం కమిటీ ఛైర్మన్, సభ్యులు వారిని ఘనంగా సన్మానించారు.