JGL: రాయికల్ మండలం కిష్టంపేటలో రూ.12 లక్షల నిధులతో నిర్మించనున్న అంగన్వాడీ నూతన భవనానికి ఎమ్మెల్యే సంజయ్ కుమార్ శంకుస్థాపన చేశారు. గ్రామస్థాయి సంక్షేమ సేవలకు అంగన్వాడీ కేంద్రాలు కీలకమని, మౌలిక వసతుల బలోపేతానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అంజా గౌడ్, ఉపసర్పంచ్ చాంద్ పాషా, ఎంపీడీవో చిరంజీవి పాల్గొన్నారు.