ABD: సకల దేవతలకు నిలయమైన గోమాతను రక్షించాలని ధర్మ జాగరణ ఆధ్వర్యంలో బుధవారం మంచిర్యాలలో మహా పాదయాత్ర ప్రారంభించారు. హమాలివాడలోని శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం నుంచి ప్రారంభమైన ఈ యాత్ర సుందిల్ల శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవాలయం వరకు 250 కిలోమీటర్లు జరుగుతుందని ధర్మ జాగరణ సభ్యుడు రవీందర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని కోరారు.