NRML: ముధోల్ మండలంలో రాత్రి కురిసిన అకాల వర్షాల వల్ల వందల ఎకరాల్లో సోయా పంట నష్టపోయింది. ఈ సందర్బంగా రైతులను పరామర్శించిన ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ప్రభుత్వం ద్వారా అన్నివిధాలా ఆదుకునేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. వ్యవసాయ అధికారులు నష్టాల అంచనాలు పంపించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు.