KMR: వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఫీజు బకాయిల కోసం రూ.15వేలు కోట్లు కేటాయించాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రెండేళ్ల ప్రభుత్వ నిధుల విడుదలపై శ్వేతపత్రం విడుదల చేయాలని అన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నీరుగారిస్తే ప్రభుత్వ పీఠం కదిలిస్తామని హెచ్చరించారు.