మంచిర్యాల: జన్నారం మండలంలోని ఇందన్ పల్లి ఐబీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం మధ్యాహ్నం ఇందన్ పల్లి ఐబి వద్ద ఎదురెదురుగా వస్తున్న బొలెరో వాహనం బైక్ ఢీకొన్నాయని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న జన్నారం పోలీసులు సంఘటన స్థలానికి బయలుదేరి వెళ్లారు. మృతులు, ప్రమాద వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.