MNCL: జన్నారం పట్టణంలోని రాంనగర్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను పరిశీలించి సిబ్బందికి ఎంపీడీఓ శశికళ సూచనలు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇందిరమ్మ ఇళ్ల యాపులో వచ్చిన పేర్లు ఆధారంగా మండలంలోని పోన్కల్ గ్రామ ఈవో రాహుల్ ఆధ్వర్యంలో సిబ్బంది పట్టణంలోని రామ్ నగర్లో ఇందిరమ్మ ఇళ్ల సర్వేను నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఎంపీడీఓ అక్కడికి వెళ్లి సర్వేను పరిశీలించారు.